దేశ వ్యాప్తంగా నిత్యం మతమార్పిడుల అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఓ వైపు ముస్లింలు లవ్ జిహాద్ పేరుతో అమాయకపు అమ్మాయిలను వలలో వేసుకుని మతమార్పిడిలకు పాల్పడుతుండగా.. మరి కొందరు క్రైస్తవులు అమాయకపు హిందువులను ప్రలోభాలకు గురిచేస్తూ మతం మారుస్తున్నారంటూ దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మతమార్పిడుల ముఠాల వెనుక విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని.. వాటితో సేవ పేరుతో ముసుగు ధరించి మతమార్పిడులు చేస్తున్నాయంటూ అనేక హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా యూపీలో ఓ ముస్లిం మతగురువు విదేశాల నుంచి హవాల రూపంలో వచ్చే ఫండ్తో దేశంలో అనేక మందిని మతం మార్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదిలావుంటే బీహార్లోని సుపాల్ జిల్లా భీంపూర్లోని కియోల్లా గ్రామంలో అమాయకపు హిందువులను లక్ష్యంగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నారు. ఈ మతమార్పిడి రాకెట్లో కేరళకు చెందిన ఓ పాస్టర్తో పాటు మరో మహిళ కూడా ఉంది. శనివారం నాడు బీహార్ పోలీసులు ఈ మతమార్పిడి రాకెట్ను ఛేధించారు. కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ మతప్రచారకులు.. పేద ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ మతమార్పిడిలు చేస్తున్నట్లు గుర్తించారు. గ్రామంలో బైబిల్లను పంపిణీ చేస్తుండగా కొందరుస్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గ్రామానికి చేరకుని విచారించారు. మత ప్రచారానికి పాల్పడుతున్న ఇద్దరిని కేరళ వాసులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
सुपौल में धर्मांतरण के आरोप में दो लोगों को पकड़ा गया है। दोनों पर लोगों को हिंदू से ईसाई धर्म में धर्मांतरण कराने का आरोप है। pic.twitter.com/PtzniZx3XY
— News18 Bihar (@News18Bihar) November 6, 2021
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుపాల్ జిల్లాలోని భెలాహి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో కేరళకు చెందిన పాస్టర్ జార్జ్ మరియు రిషు ఉంటున్నారు. ఈ మతమార్పిడి పనికి నెలకు రూ.12,000/- చెల్లించినట్లు కూడా పాస్టర్ జార్జ్ విచారణ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఇలా డబ్బులును ఆశ చూపి అనేకమందిని గ్రామంలో క్రైస్తవంలోకి మతం మార్చినట్లు సమాచారం. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. వారి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై గ్రామస్తుల నుంచి ఎలాంటి వ్రాతపూర్వక ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే గతకొన్నేళ్లుగా ఈ క్రైస్తవ మతప్రచారకులు ఆ ప్రాంతంలో అనేక మంది హిందువులను మతం మార్చినట్లు సమాచారం.