జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి మళ్లీ పెరుగుతోంది. కశ్మీర్లోయ గతకొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉందనుకుంటున్న వేళ.. ఇటీవల వరుసగా ఉగవ్రాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాదు.. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు కూడా పట్టుబడుతున్నారు. అయితే ఇలా పట్టుబడ్డ ఉగ్రవాదుల వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా లభ్యమవుతోంది. ఇన్నాళ్లు పాక్లో తయారైన ఆయుధాలు మాత్రమే లభించేవి. మరికొన్ని ఉగ్రవాదులు తయారు చేసుకున్న ఆయుధాలు పట్టుబడేవి. తాజాగా చైనాకు చెందిన గ్రెనేడ్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. బారాముల్లా పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. బోనియార్ ప్రాంతంలో సోమవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేయగా.. వారి వద్ద నుంచి రెండు చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. పట్టుబడ్డ ఉగ్రవాదులు చైనాకు చెందిన హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు.. ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అక్రమంగా అమ్మకాలు కూడా జరుపుతున్నట్లు గుర్తించారు. వీరు ఇతర స్మగ్లింగ్లకు కూడా పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అయితే నరరూప రాక్షసులైన ఉగ్రవాదుల చేతిలోకి చైనాకు చెందిన హ్యాండ్ గ్రెనేడ్లు ఎలా వచ్చాయి..? ఇవి ఉగ్రవాదుల చేతిలోకి ఎవరి ద్వారా వెళ్తున్నాయి..? లేదా చైనా మరేదైనా కుట్ర పన్నుతుందా..? అన్నటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి.
Baramulla Police arrested two over ground workers of Hizbul Mujahideen in Boniyar area today. Two Chinese hand grenades were recovered from their possession. They were active in trading, smuggling and arranging arms and ammunition for the outfit: Jammu and Kashmir Police pic.twitter.com/zQpD8t9Med
— ANI (@ANI) April 26, 2021