42 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరిన విగ్రహాలు..! విగ్రహాల విలువ కోట్ల రూపాలయల్లోనే.. ఫుల్‌ స్టోరీ..

Spread the love

భారత దేశం.. ఇది ఓ అమృత బాండాగారం వంటిది. మన దేశంపై ఎంత మంది దండయాత్ర జరిపారో తెలియంది కాదు. తురుష్కుల నుంచి మొదలుకుని.. మొఘులులు, పోర్చుగీస్, బ్రిటీష్ వారు ఇలా అనేక మంది దేశంపై దండయాత్ర చేశారు. వీరిలో మొఘులులు, బ్రిటీష్ వారు ఎక్కువ కాలం పరిపాలించారు. ఈ కాలంలో దేశంలోని విలువైన సంపదనంతా ఓడల్లో తరలించుకుపోయారు. రోజుల కొద్ది టన్నుల సంపదను దొంగిలించారు. వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నగలతో పాటు.. అనేక దేవాలయాలను కొల్లగొట్టి.. అందులో ఉన్న పంచలోహ విగ్రహాలను దోచుకెళ్లారు.

ఇలా లెక్క కూడా తెలియనంత దేశ సంపద పరదేశీయులపాలైంది. ఇప్పటికీ దేశంలోని పురాతన ఆలయాల్లో అనేక పంచలోహ విగ్రహాల లెక్క ఖచ్చితంగా తెలుసా అన్న ప్రశ్నలకు సమాధానం లేదనే వినిపిస్తోంది. అయితే బ్రిటీష్‌ వారు దోచుకుపోయిన కొన్ని విగ్రహాలే కాకుండా.. అక్రమార్కులు దొచుకుని ఇంగ్లాండ్‌కు తరలించిన పలు విగ్రహాలను అక్కడి ప్రభుత్వం మ్యూజియంలో భద్రపరిచింది. ఈ క్రమంలో భారత ప్రధానిగా మోదీ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి బ్రిటీష్ సర్కార్‌పై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. ఈ క్రమంలో మెల్లిగా ఒక్కో విగ్రహాన్ని బ్రిటీష్ సర్కార్ భారత ప్రభుత్వానికి అందజేస్తోంది.

ఈ క్రమంలో 1978లో తమిళనాడులోని నాగపట్నం విష్ణు దేవాలయం నుంచి దొంగిలించబడ్డ సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడి పంచలోహ విగ్రహాలను బ్రిటీష్ ప్రభుత్వం భారత్‌కు అందజేసింది. ఈ విగ్రహం విజయనగర సామ్రాజ్యం కాలం నాటిది.లండన్‌ మెట్రోపాలిటన్ పోలీసుల సహకారంతో లండన్‌లోని భారత హై కమిషన్‌ ఈ విగ్రహాలను పొందింది. అనంతరం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్ పటేల్‌ తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. ఈ పంచలోహ విగ్రహాలకు సంబంధించిన చిత్రాలను కేంద్ర మంత్రి తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

విజయ నగర రాజులు పరిపాలించిన కాలం నాటి మూడు కాంస్య విగ్రహాలు (సీత, రాముడు, లక్ష్మణుడు) యూకేలోని భారత రాయబార కార్యాలయం తమిళనాడు ప్రభుత్వానికి అందజేసిందని పేర్కొన్నారు. ఈ విగ్రహాల ఎత్తు మూడు అడుగులు అని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 56 పురాతన విగ్రహాలు భారత్‌కు చేరుకున్నాయి. వీటిలో మోదీ సర్కార్‌ హయాంలోనే 43 విగ్రహాలు వచ్చాయని కేంద్ర మంత్రి తన ట్విట్టర్‌ పోస్టులో తెలిపారు.

కాగా, తాజాగా బంగ్లాదేశ్ తరలిస్తుండగా పెద్ద ఎత్తున పంచలోహ విగ్రహాలు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికీ దేశంలోని పలు ఆలయాల్లో ఉన్న విగ్రహాలను గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్తున్నారు దుండగులు.


Spread the love
error: Content is protected !!