సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. మరో కొత్త స్కీమ్ ప్రారంభం‌..!

Spread the love

సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త తీపి కబురు చెప్పింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన మోదీ సర్కార్‌.. సామాన్య ప్రజలకు పెద్దపీఠ వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బడ్జెట్‌2021లో భాగంగా మరో కొత్త స్కీమ్‌కు పురుడు పోశారు. ఇప్పటికే ఆత్మ నిర్బర్‌ భారత్‌ పేరుతో కరోనా సంక్షోభం నుంచి ఉద్దీపన పథకాన్ని ప్రకటించగా.. తాజాగా ఆత్మ నిర్బర్‌ హెల్త్‌ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇందుకోసం ఏకంగా రూ.64,180 కోట్లను కేటాయించారు.

ఈ కొత్త పథకం ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బలోపేతమౌతుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ స్కీమ్‌ వ సామాన్యులకు భారీగా ఊరట కలుగనుంది.

 


Spread the love
error: Content is protected !!