అన్లాక్ 5.0 గైడ్లైన్స్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 4.0 గైడ్లైన్స్లో మరిన్ని సడలింపులను ఇస్తూ.. 5.0 మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ అన్లాక్లో అక్టోబర్ 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లకు షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా థియేటర్లలో, మల్టీప్టెక్స్లలో 50 శాతం మాత్రమే సీటింగ్కు అనుమతులిస్తున్నట్లు స్పష్టంగా తెలియజేసింది. ఇక క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్ పూల్స్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ఎడ్యూకేషనల్ ఇన్సిస్టిట్యూషన్స్ ఎప్పుడు తెరవాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అక్టోబర్ 15వ తేదీ తర్వాత రాష్ట్రాలకు చెందిన విద్యా సంస్థల తెరవాలన్న దానిపై.. స్థానికంగా ఉన్న విద్యార్ధుల తల్లిదండ్రులతో సంప్రదించిన అనంతరం ఓ నిర్ణయానికి రావాలని.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇక అక్టోబర్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేసింది.