ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. మన దేశంలో మాత్రం దారుణ ఘటనలు జరుగుతున్నాయి. మొన్న దొంగలు సంచరిస్తున్నారన్న నెపంతో మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో ఇద్దరు సాధువులపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన ఇంకా దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుండగానే… మంగళ వారం ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బులంధ్షహర్లోని అనుప్షహర్ ప్రాంతంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో ఇద్దరు సాధువుల మృతదేహాలు ఉండటం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఇద్దరు సాధువులు కూడా సమీపంలోని ఓ శివాలయంలో పూజలు చేస్తారని
తెలుస్తోంది.
అయితే రంగంలోకి దిగిన పోలీసులు సాధువుల హత్యతో ప్రమేయం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఎలాంటి టెన్షన్ వాతావరణం లేదని.. బులంద్ షహర్ పోలీస్ అధికారి తెలిపారు. కాగా.. సాధువుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
#WATCH The accused has been arrested. As per initial probe, it has been found that few days back,he had taken away a belonging (chimta) of priests after which they had scolded him. Following which,he murdered 2 priests today. Probe underway: Santosh Kumar Singh, SSP Bulandshahr pic.twitter.com/bKABSj7Ffa
— ANI UP (@ANINewsUP) April 28, 2020
Bodies of two priests found at a temple in Bulandshahr. Police investigation underway. Post-mortem reports awaited. pic.twitter.com/SsH7hMrrSv
— ANI UP (@ANINewsUP) April 28, 2020