యూపీలో దారుణం.. ఆలయ ప్రాంగణంలో ఇద్దరు సాధువుల హత్య..!

Spread the love

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. మన దేశంలో మాత్రం దారుణ ఘటనలు జరుగుతున్నాయి. మొన్న దొంగలు సంచరిస్తున్నారన్న నెపంతో మహారాష్ట్రలోని పాల్‌ఘర్ ప్రాంతంలో ఇద్దరు సాధువులపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన ఇంకా దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుండగానే… మంగళ వారం ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బులంధ్‌షహర్‌లోని అనుప్‌షహర్‌ ప్రాంతంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో ఇద్దరు సాధువుల మృతదేహాలు ఉండటం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఇద్దరు సాధువులు కూడా సమీపంలోని ఓ శివాలయంలో పూజలు చేస్తారని
తెలుస్తోంది.

అయితే రంగంలోకి దిగిన పోలీసులు సాధువుల హత్యతో ప్రమేయం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఎలాంటి టెన్షన్ వాతావరణం లేదని.. బులంద్ షహర్ పోలీస్ అధికారి తెలిపారు. కాగా.. సాధువుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

 


Spread the love
error: Content is protected !!