బ్రేకింగ్‌.. హత్రస్‌ ఘటనలో సీఎం యోగీ సంచలన నిర్ణయం .. ఎస్పీ,డీఎస్పీ నుంచి మొదలు పెడితే..!

Spread the love

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన యూపీ హత్రస్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటన గురించి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విపక్షాల నుంచే కాకుండా.. యావత్‌ దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. సీఎం యోగీకి కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం నాడు సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా వెలువడిన రిపోర్టు ఆధారంగా.. ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరికొందరు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం ఆఫీస్ వెల్లడించింది. కాగా, నిందితులను ఉరితీయాలన్న డిమాండ్‌ కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవల బీజేపీ జాతీయ నేత కైలాస్‌ విజయ వర్గీయ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. యోగీ పరిపాలనలో పోలీసుల వాహనాలు ఎప్పుడైనా బోల్తా పడవచ్చంటూ.. పరోక్షంగా సంకేతాలిచ్చారు.


Spread the love
error: Content is protected !!