యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మాఫియా ముఠాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న యోగీ.. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అల్లరిమూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాజకీయ ప్రచార సభలను ప్రారంభించాయి. ఇటీవల రాష్ట్రంలోని ఖుషీనగర్లో జరిగిన ఓ ప్రచార సభలో అబ్జాజాన్ అని మాట్లాడేవారంతా ఇంతకుముందు రేషన్ సరుకుల్ని మింగేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ముస్లిం వర్గాలను ఉద్దేశించి చేశారంటూ ప్రతిపక్షాలు యోగీపై విరుచుకుపడ్డాయి. అయితే ప్రతిపక్షాలు చేసిన విమర్శలను యోగీ మాత్రం పట్టించుకోకుండా.. మంగళవారం నాడు మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“అబ్బాజాన్, చాచా జాన్” అనే కొంతమంది బోధకులకు తాను హెచ్చరిస్తున్నానంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు సీఏఏ పేరుతో ప్రజల్లో అలజడి సృష్టించి.. అల్లర్లు సృష్టిద్దామనుకుంటున్నారని.. అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిద్దామనుకుంటున్న బ్యాచ్ రెచ్చిపోతే.. వారి ఛాతిపై బుల్డోజర్లు ఎక్కించడమేనంటూ యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఘాటు హెచ్చరికలు చేశారు.
I want to warn that person who is invoking feelings in the name of CAA, I want to say to these preachers of 'Abba Jaan' and 'Chacha Jaan' that if they try to do it then the state govt knows how to handle it strictly: CM Yogi Adityanath in Kanpur pic.twitter.com/sBwIJcon5O
— ANI UP (@ANINewsUP) November 23, 2021