అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడ్డారు. ట్రంప్తో పాటుగా భార్య మిలానియా ట్రంప్కు కూడా కరోనా సోకింది.తొలుత ట్రంప్ సలహాదారు హోప్స్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అధ్యక్షుడు ట్రంప్ సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే ట్రంప్ దంపతులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో ట్రంప్ దంపతులకు పాజిటివ్గా తేలింది. అయితే ట్రంప్ సలహదారు హోప్ హిక్స్కు పాజిటివ్ అని తేలడంతోనే ట్రంప్ దంపతులు కూడా క్వారంటైన్ అయ్యారు. ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ తన అధికారిక ట్విట్టర్లో తెలిపారు. వెంటనే రికవరీ అయ్యేందుకు ప్రక్రియ ప్రారంభించామని.. ఈ కరోనా వైరస్ నుంచి త్వరలోనే విముక్తి చెందుతామని ట్రంప్ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు.