బీజేపీ నేతలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వెస్ట్ బెంగాల్లో ఓ కౌన్సిలర్ను హతమార్చిన ఘటన మరువకముందే.. ఉత్తరాఖండ్లో మరో బీజేపీ కౌన్సిలర్ ప్రకాష్ ధమీ హత్యకుగురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం ఉత్తరాఖండ్లోని ఉధంసింగ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని రుద్రాపూర్ పట్టణంలోని ఇంటి వద్ద ఉండగా.. ప్రకాష్ ధమీపై గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కాల్పులకు దిగారు. ఇది గమనించిన ధమీ.. వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు పరుగులు తీయగా.. కారులో వచ్చిన వ్యక్తులు వెంటాడి మరీ కాల్పులు జరిపారు. దీంతో ధమీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బుల్లెట్ల గాయాలతో పడిఉన్న ధమీని.. స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధమీకి గతంలో ఉన్న పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ దిలీప్ సింగ్ తెలిపారు. కాగా, ప్రకాష్ ధమీ 2018లో కౌన్సిలరుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు.
Read More..
పట్టభద్రులారా.. ఆన్లైన్లో మీ ఓటు మీరే నమోదు చేసుకోండి.. ఈ సింపుల్ స్టెప్స్తో..!
గాంధీజీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఐదు అంశాలు.. ఆచరిస్తే అద్భుతమే