దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఎంతో కీలకమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన వారందరికీ మూడో దశలో వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే ఈ మూడో దశలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ విషయంలో అనేక మంది ఏప్రిల్ 24 నుంచి అంటూ ప్రచారం చేస్తుండటంతో.. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. 18+ వయస్సు వారి కోసం ఏప్రిల్ 24వ తేదీ వరకు కోవిన్ పోర్టల్ సిద్ధంగా ఉంటుందని.. ఏప్రిల్ 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది.
It is clarified that #CoWin portal will be made ready for 18+ beneficiaries by 24th April.
Registrations for 18+ citizens to book appointments (from 1st May) will begin on 28th April.@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @DDNewslive— Ministry of Health (@MoHFW_INDIA) April 22, 2021