సోషల్ మీడియా ప్రస్తుతం సైబర్ క్రైం నేరగాళ్లకు అడ్డాగా మారిపోతుంది. అవకాశం దొరికితే చాలు.. అమాయకులను బోల్తా కొట్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా సైబర్ ముఠా ఓ ఫేక్ లింకును షేర్ చేస్తూ.. గిఫ్ట్లంటూ ఎరవేస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాబోయే వాలంటైన్ వేడుకలను దోపిడీ ముఠా తమ ఇన్వెస్ట్మెంట్గా భావించి..సోషల్ మీడియా యూజర్ల డాటాను చోరీ చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది.
అనుకుందే తడవుగా.. అందరూ గుర్తుపట్టి నమ్మే టాటా సంస్థ పేరుతో ఓ ఫేక్ లింకును క్రియేట్ చేసింది. ఆ లింకుపైన ఓ టైటిల్ పెట్టారు. అదే వాలంటైన్ గిఫ్ట్ అని.. మీరు సులువైన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే.. మీకు వెంటనే ఫోన్ గిఫ్ట్ వస్తుందని బురిడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ లింకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది గమనించిన తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు సోషల్ మీడియా యూజర్లను అలర్ట్ చేస్తున్నారు. టాటా పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. కేటుగాళ్లు టాటా పేరుతో డాటా చోరీ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సో మీరంతా అలాంటి లింకులను ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
Beware of valentine's Day gift fraud with the name of #TATA#ValentinesDay #online #gift #fraud #cybercrimespscyberabad #cyberabadpolice@cyberabadpolice @TelanganaDGP @TelanganaCOPs @hydcitypolice @RachakondaCop @SCSC_Cyberabad @ts_womensafety @TataCompanies pic.twitter.com/sAYw3xOBqF
— Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) February 2, 2021