హిందువులపై జరిగే దాడులను ఇక సహించేది లేదు.. బజరంగ్ దళ్

Spread the love

హిందువులపై దాడులు జరుపుతూ.. దేశ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్న దుష్ఠశక్తులకు వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్- బజరంగ్ దళ్ నిరసనలు చేపట్టింది. కుట్ర పూరితంగా హిందువులపై దాడులు జరుపుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న జిహాదీ మూకలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చెపట్టింది.

VHP Bajrang Dal Protest at Medchal Dist Collectarate

ఇందులో భాగంగా మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ఎదుట నగరానికి చెందిన వీహెచ్పీ- బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించారు.

Memorondum to collector

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బజరంగ్ దళ్ కో కన్వీనర్ జీవన్, సికింద్రబాద్ విభాగ్ కన్వీనర్ శ్రీకాంత్, విహెచ్పీ జిల్లా కార్యదర్శులు స్వామి,రజినీకాంత్,యోగానంద రాజు, సహా కార్యదర్శి ఆశిష్, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ సుమంత్, వీహెచ్పి- బజరంగ్ దళ్ కార్యకర్తలు రేవంత్, అనిల్,పవన్, తిరుపతి,శ్రీకాంత్,కార్తిక్,చరణ్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర అధ్యక్షుడు దొంతమల్ల రాంబాబు, ఎస్సీ-ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర పుణ్య రాజు, జిల్లా బీజేవైఏం నేత నల్ల వెంకట్ రెడ్డి పలువురు స్థానిక హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.

 


Spread the love
error: Content is protected !!