హిందువులపై దాడులు జరుపుతూ.. దేశ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్న దుష్ఠశక్తులకు వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్- బజరంగ్ దళ్ నిరసనలు చేపట్టింది. కుట్ర పూరితంగా హిందువులపై దాడులు జరుపుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న జిహాదీ మూకలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చెపట్టింది.
ఇందులో భాగంగా మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ఎదుట నగరానికి చెందిన వీహెచ్పీ- బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బజరంగ్ దళ్ కో కన్వీనర్ జీవన్, సికింద్రబాద్ విభాగ్ కన్వీనర్ శ్రీకాంత్, విహెచ్పీ జిల్లా కార్యదర్శులు స్వామి,రజినీకాంత్,యోగానంద రాజు, సహా కార్యదర్శి ఆశిష్, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ సుమంత్, వీహెచ్పి- బజరంగ్ దళ్ కార్యకర్తలు రేవంత్, అనిల్,పవన్, తిరుపతి,శ్రీకాంత్,కార్తిక్,చరణ్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర అధ్యక్షుడు దొంతమల్ల రాంబాబు, ఎస్సీ-ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర పుణ్య రాజు, జిల్లా బీజేవైఏం నేత నల్ల వెంకట్ రెడ్డి పలువురు స్థానిక హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.