అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పురస్కరించుకుని.. యావత్ ప్రపంచంలో సంబరాలు మిన్నంటాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీ రాముడి చిత్ర పటాలకు పూజలు చేస్తూ.. సంబరాలు జరుపుకున్నారు. అయోధ్యలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్న ముహుర్తంలో భూమి పూజ కార్యక్రమం కృతువు నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో కూడా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా భాగ్యనగరం కోఠిలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఉదయమే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక హోమం చేసిన అనంతరం.. రామ భక్తులంతా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, జాతీయ సంయుక్త కార్యదర్శి గుమ్మల సత్యం జీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ రాజు గారు, మహానగర్ అధ్యక్షుడు కోడె శ్రీనివాస్ రాజ, తెలంగాణ బజరంగ్ దళ్ సంయోజక్ సుభాష్ చందర్, భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
కోఠి వీహెచ్పీ రాష్ట్ర కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో చూడండి..#Ayodhya #AyodhyaBhoomipoojan #AyodhyaRamMandir #RamMandir #Gaganam #GaganamNews #Gaganamnewz #VHP pic.twitter.com/DS2J38cRd6
— Gaganam News (@GaganamNewz) August 5, 2020
https://www.facebook.com/watch/?v=2652890484998809