బెంగాల్‌ హింసపై VHP కన్నెర్ర.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. యాక్షన్‌ తీసుకుంటారా.. లేదా..

Spread the love

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వెస్ట్ బెంగాల్‌లో హింస చేలరేగుతోంది. టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలు గుండాల్లో ప్రవర్తిస్తూ.. బీజేపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపై దాడులకు దిగారు. అంతేకాదు.. బీజేపీ అనుబంధ సంస్థలపై, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బీజేపీ, అనుబంధ సంస్థల కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. అంతేకాదు.. బీజేపీకి అనుబంధంగా ఉన్నారన్న కారణంతో పలువురు మహిళలపై అత్యాచారాలకు కూడా తెగబడ్డారు. అయితే ఇంతటి ఘోరాలు జరుగుతున్నప్పటికీ.. అక్కడి మమతా సర్కార్‌ నిద్రమత్తులో ఉంది. అటు పోలీసులు కూడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదంటూ బుకాయిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో బెంగాల్‌లోని హిందువులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే హిందువులకు చెందిన అనేక దుకాణాలు లూటికి గురయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌, రోహింగ్యా ముస్లింలే ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు స్థానిక హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చింది. వెస్టె బెంగాల్‌లో చెలరేగిన హింసాయుత ఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే.. హిందువులకు తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలుసని.. ఆత్మరక్షణకు ఏం చేయాలో హిందూ సమాజానికి తెలుసంటూ విశ్వ హిందూ పరిషత్‌ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాండే అన్నారు. బెంగాల్ హింసలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో హిందువుల ప్రాణాలకు రక్షణ కరువైందని.. టీఎంసీ పార్టీకి చెందిన అల్లరి మూకలు బీజేపీతో పాటుగా.. హిందూ దేవాలయాలు, హిందువులకు చెందిన దుకాణాలను లూటి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే పది మందికిపైగా బీజేపీకి చెందిన కార్యకర్తలతో పాటు.. అనుబంధ సంస్థలకు చెందిన వారిని చంపేశారన్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర
వహిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుని దుండుగులను కఠినంగా శిక్షించాలంటూ వీహెచ్పీ డిమాండ్ చేసింది.

 


Spread the love
error: Content is protected !!