దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్ను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. తొలుత ఏప్రిల్ 14 వరకు విధించిన లాక్డౌన్ను.. మళ్లీ మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. కొందరు అన్న ప్రసాదం వితరణ చేస్తుంటే.. మరికొందరు రెండు మూడు రోజులకు సరిపడ రేషన్ సరకులను అందజేస్తున్నారు. అందులో విశ్వ హిందూ పరిషత్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అనిర్వచనీయం. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షల మందికి సహాయ సహకారాలందిస్తుంది.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ సేవలు విస్తృతంగా ఉన్నాయి. అటు నగరాల్లోనే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాదు.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు కూడా ఆపన్న హస్తాన్నిఅందిస్తోంది. భాగ్యనగరంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం వేదికగా.. రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాలకు కావాల్సిన రేషన్ సరకులను పంపిణీ చేస్తున్నారు. కొన్ని వందల క్వింటాల్ల బియ్యాన్ని అందజేస్తోంది. వాటితో పాటు నిత్యవసర సరకులను కూడా అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు గారు, కేంద్రీయ సహ కార్యదర్శి శ్రీ గుమ్మళ్ల సత్యం గారు, శ్రీ కన్నా భాస్కర్ గారు, తెలంగాణ ప్రాంత కార్యదర్శి బండారి రమేష్ గారు, ప్రాంత అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, రామారాజు గారు పాల్గొంటున్నారు. కార్యాలయం వేదికగా ప్రాంత సహకార్యదర్శులు గణపురం రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ గార్లు, ప్రాంత బజరంగ్
దళ్ సంయోజక్ సుభాష్, సహ సంయోజక్లు వీర్ కుమారస్వామి, శివరాం, నగర అధ్యక్షులు శ్రీనివాస రాజా, ప్రాంత సహ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి గారు భాగ్యనగరంలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవాకార్యక్రమాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు, సహకరించిన దాతలకు ప్రాంత కార్యదర్శి రమేష్ జీ అభినందనలు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదురిస్తూ పరిసరాలను శుభ్రం చేస్తున్న పారిశుద్ద కార్మికులను, నిరంతరం రక్షణ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను సన్మానించారు. ఈ కరోనాతో జరుగుతున్న యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులకు, ప్రభుత్వాధికారులకు అభినందనలు తెలిపారు.
ఇక.. తొలి విడత లాక్డౌన్ సమయానికే.. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 3060 గ్రామాలు/నగరాల్లో అనేక సేవాకార్యక్రమాలు చేపట్టింది. 8555 స్థలాల్లో లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ.. అనేక కుటుంబాలకు రేషన్ సరకులను అందజేసింది. ఏప్రిల్ 14వ వరకు సుమారు ఏడు లక్షల కుటుంబాలకు రేషన్ సరకులను అందజేసినట్లు పరిషత్కు సంబంధించిన అధికారులు తెలిపారు.అంతేకాదు.. 70 లక్షల మందికి ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఇక పలు చోట్ల శానిటైజర్లను, మాస్క్లను కూడా పంపిణీ చేశారు. ఈ మహత్కార్యంలో దాదాపు 40వేల మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారని వీహెచ్పీ అధికారులు తెలిపారు.