చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి VHP ప్రత్యేక పూజలు

Spread the love

శ్రావణ శుక్రవారం చివరి రోజు కావడంతో భాగ్యలక్ష్మి అమ్మవారిని విశ్వహిందూ పరిషత్ నాయకులు దర్శించుకున్నారు. లోక కళ్యాణం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యనగరంలో సౌభాగ్యాలు కలిగి, మహానగరం ప్రశాంతంగా ఉండాలని వేడుకున్నారు. విశ్వహిందూ పరిషత్ తమిళనాడు క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ ఆకారపు కేశవరాజు గారు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్ జి, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంబాగ్ ప్రచార ప్రముఖ్ రాజగోపాల్ , VHP, సంఘ్ పరివార్ అధికారులు అఖిలేష్ , నాగ పరిమళ , దేవిక రెడ్డి , రేగు అనిల్ , రజనీకాంత్ , ముకేశ్ యాదవ్ , అనిల్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయం పూజారులు వారికి స్వాగతం పలికి , ఆశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.


Spread the love
error: Content is protected !!