తెలంగాణలో బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న సమచయంలో.. బాణాసంచా కాల్చడంపై హైకోర్టు నిషేధాన్ని విధించింది. దీనిపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ స్పందింస్తూ.. కేవలం హిందువుల పండుగల సమయంలోనే కాలుష్యమంటూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు. పండుగలు జరుపుకుంటే.. కేసులు నమోదు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. దీపావళి పండుగకు బాణాసంచా కాల్చడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అని.. ఇప్పుడు పండుగ రెండు రోజుల ముందు కోర్టు ఇచ్చిన ఇలాంటి తీర్పుతో ఎంతో మంది చిరు వ్యాపారులు ఇబ్బందుల పాలవుతారన్నారు. ఇప్పటికే పటాకుల విక్రయం కోసం అనేక మంది పర్మిషన్లు పెట్టుకున్నారన్నారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా చితికిలపడ్డ చిరు వ్యాపారులు.. ఇప్పుడు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకువచ్చి.. బాణాసంచా కాల్చడంపై ఆంక్షలున ఎత్తివేసేలా చూడలని.. విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు.
కాగా, దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచాపై నిషేధం విధించాలంటూ న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ హైకోర్టులో పిల్ దాఖలు
చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చడం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే వాదనలు విన్న హైకోర్టు.. ఇప్పటి వరకు తెరిచి ఉన్న క్రాకర్స్ షాప్స్ను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా క్రాకర్స్ అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఈ నెల(నవంబర్) 19వ తేదీన తెలపాలంటూ హైకోర్టు తెలిపింది.