బ్రేకింగ్‌.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్

Spread the love

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. దేశంలో రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్య ప్రజల నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందర్నీ తాకుతోంది.

తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. మంగళవారం ఉదయం ఆయనకు కరోనా పరీక్షలు జరపగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నట్లు ట్విట్టర్‌ పోస్టులో పేర్కొన్నారు. ఇక ఆయన భార్య ఉషా నాయుడుకు కూడా కరోనా పరీక్షలు జరపగా ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు.


Spread the love
error: Content is protected !!