విశ్వహిందూ పరిషత్ “లక్ష యువగళ గీతార్చన”కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ..!! 

Spread the love

“లక్ష యువగళ గీతార్చన”కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ..!! 

*కౌకూర్ లో బ్యానర్ విడుదల చేసిన వీహెచ్పీ*

*డిసెంబర్ 14న పరేడ్ గ్రౌండ్లో బహిరంగ కార్యక్రమం*

 

మల్కాజ్ గిరి (అణుశక్తి) జిల్లా కౌకూర్ లో బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపానికి విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్ గిరి జిల్లా కార్యదర్శి రజినీకాంత్, బజరంగ్ దళ్ సంయోజక్ జుంగం శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక గణేష్ మండపం వద్ద నిర్వాహకులతో కలిసి డిసెంబర్ నెల 14వ తేదీన నిర్వహించే లక్ష యువగళ గీతార్చన బ్యానర్ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు కిరణ్, హరీష్,కిషోర్,శ్రీకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

 

గీత జయంతి సందర్భంగా డిసెంబరు 14వ తేదీన విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన లక్ష యువ గీతర్చన కార్యక్రమం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్నట్లు జిల్లా కార్యదర్శి రజనీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు హాజరయ్యే అవకాశం ఉందని.. అంతే కాకుండా అనేక మంది సాధు,సంత్ లు, పీఠాధిపతులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కౌకూర్ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో హిందూ యువత పాల్గొనేల ప్రయత్నిస్తామని గణేష్ మండప నిర్వాహకులు తెలియ చేశారు.


Spread the love
error: Content is protected !!