మల్కాజ్ గిరి (అణుశక్తి) జిల్లా సైనిక్ పురి ప్రఖండలోని బాలాజీ నగర్ శ్రీ రామ్ నగర్ కాలనీలో నెలకొల్పిన గణేష్ మండపానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బింగి సతీష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సంతోష్ గుప్తా, విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్ గిరి జిల్లా కార్యదర్శి రజినీకాంత్, రుద్ర రవి కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక గణేష్ మండపం వద్ద నిర్వాహకులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ డిసెంబర్ నెలలో నిర్వహించే లక్ష యువగళ గీతార్చన బ్యానర్ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు సంతోష్, చింటు, ముకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, డిసెంబర్ 14వ తేదీన గీత జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన లక్ష యువ గీతర్చన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ఈ కార్యక్రమానికి వేలాది మంది పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్ గిరి జిల్లా కార్యదర్శి రజనీకాంత్ పిలుపునిచ్చారు.