వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి..!

Spread the love

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. అనేక దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ప్రజా రవాణా స్థంభించిపోయింది. ఇక ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో అంతా వారి వారి స్నేహితులతో, బంధువులతో మాట్లాడుకునేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందులో ముఖ్యంగా వీడియో కాల్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా యాప్స్‌ యూజర్ల కోసం లేటెస్ట్‌ అప్డేట్స్‌ను ఇస్తున్నాయి.

ముఖ్యంగా ఎక్కువ మంది మెసెంజర్‌గా ఉపయోగించే వాట్సప్‌ కూడా యూజర్ల కోసం సరికొత్త అప్డేట్‌ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్‌లో కేవలం నలుగురు మాత్రమే గ్రూప్‌ కాల్స్‌ మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఇకపై వాట్సప్‌ వాయిస్‌ కాల్స్‌లో కానీ.. వీడియో కాల్స్‌లో కానీ.. ఒకేసారి 8 మందితో మాట్లాడవచ్చని వాట్సప్‌ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. ప్రజలు వాట్సప్‌ ద్వారా వాయిస్‌ లేదా వీడియో కాల్‌ చేయడం బాగా పెరిగిందని.. ఈ క్రమంలో గ్రూప్‌ కాల్స్‌లో మరింత ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం కావాలని వినియోగదార్ల నుంచి రిక్వెస్ట్స్‌ పెరిగిన నేపథ్యంలో.. గతంలో ఉన్న గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ పరిమితిని పెంచినట్లు వాట్సప్‌ సంస్థ పేర్కొంది.


Spread the love
error: Content is protected !!