ఢిల్లీ ఐసీస్ ఉగ్రవాది పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అబూ యూసుఫ్ అనే ఐసీస్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శనివారం తెల్లవారుజామున ధౌల్ కుమాన్, కరోల్ బాగ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత అబూ యూసుఫ్ను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక బృందం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. సదరు ఉగ్రవాదిని అరెస్ట్ చేసే సమయంలో.. అతడి వద్ద పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలిపారు.
అయితే ఈ ఘటనపై ఐసీస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ భార్య స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయనను అరెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటీ.? నాకు నలుగురు పిల్లుల ఉన్నారని.. ఇప్పడు నేను.. నా నలుగురు పిల్లలు ఎక్కడికి వెళ్లాలంటూ ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీతో ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాదు.. ఇంట్లో గన్ పౌడర్తో పాటుగా ఇతర మందుగుండు సామాగ్రిని స్టోర్ చేసేవాడని.. ఇదేంటంటూ ప్రశ్నిస్తే తనను ఆపొద్దంటూ అనేవాడని తెలిపింది. తన భర్తను క్షమించి వదిలేస్తారని కోరకుంటున్నానంటూ న్యూస్ ఏజెన్సీతో పేర్కొంది ఎందుకంటే… నాకు నలుగురు పిల్లలు ఉన్నారని.. ఇప్పుడు మేమంతా ఎక్కడికి వెళ్లాలని ప్రశ్రిస్తోంది.
కాగా, ఇదిలావుంటే రెండు రోజుల క్రితమే బెంగళూరులో కూడా ఐసీస్తో లింకులున్న ఓ వైద్యుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మరోవైపు ఐసీస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ను 8రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక అబూ యూసుఫ్ది యూపీలోని బలరాంపూర్గా గుర్తించారు. ఆయన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు.. పలు రద్దీ ప్రదేశాలపై అబూ యూసుఫ్ రిక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అబూ యూసుఫ్ ద్వారా.. ఇంకా ఎవరెవరు ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారన్నదానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.