Facebook.. బంగ్లాదేశ్‌ హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తే బ్లాక్‌ చేస్తారా..?

Spread the love

హిందువుల పవిత్రమైన పండుగ శరన్నవరాత్రి వేడుకలు బెంగాల్‌ ప్రాంతంలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. బెంగాల్‌తో పాటుగా.. అటు బంగ్లాదేశ్‌లోని హిందువులు కూడా పెద్ద ఎత్తున ఈ దసరా వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే అక్కడి ఇస్లామిక్‌ అల్లరి మూకలు ఉగ్రవాద భావజాలంతో.. మైనార్టీలైన హిందువులపై నిత్యం దాడులు జరుపుతున్నారు. హిందూ యువతులను అపహరించుకుపోవడం.. ఆపై బలవంతంగా మతమార్పిడులు చేయడం జరుగుతోంది. అంతేకాదు.. దేవాలయాలపై దాడులు చేయడం.. అందులోని విగ్రహాలను ధ్వంసం చేస్తూ.. హుండీలను అపహరించుకుపోవడం నిత్యకృత్యంగా మారింది. అయితే ఈ ఏడాది దసరా వేడుకల నేపథ్యంలో ఇస్లామిక్‌ ఉగ్రవాద మూకలు.. మైనార్టీలైన హిందువులపై పెద్ద ఎత్తున దాడులకు దిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచి ఇస్కాన్‌ సంస్థ దేవాలయంపై కూడా దాడులకు పాల్పడటమే కాకుండా.. ఓ భక్తుడిని హతమార్చారు. పలు హిందూ కుటుంబాల ఇళ్లను తగలబెడుతూ.. అందులో ఉన్న మహిళలపై అత్యాచారాలకు
పాల్పడుతూ.. అనేకమందిని హతమార్చారు. హిందువులపై ఇస్లామిక్‌ అల్లరి మూకల రాక్షస క్రీడను ప్రపంచానికి తెలియజేసేందుకు కేవలం సోషల్‌ మీడియా మాత్రమే వేదికగా మారింది. అయితే ఈ సోషల్‌ మీడియా కూడా హిందువులపై దాడులను ఖండిస్తూ పోస్ట్ చేసిన ప్రముఖుల ఖాతాలను బ్లాక్‌ చేయడం జరిగింది.

అందులో ముఖ్యంగా ప్రముఖ బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా బ్లాక్‌ అయ్యింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో సదరు పోస్ట్‌ను ఫేస్‌బుక్ పరిగణలోకి తీసుకుని ఏడురోజుల పాటు ఆమె ఖాతాను బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేసింది. తాను బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పోస్ట్ చేసినందుకే ఫేస్‌బుక్‌ మరోసారి తన అకౌంట్‌పై వారం రోజుల పాటు నిషేధాన్ని విధించిందని పేర్కొన్నారు.


Spread the love
error: Content is protected !!