లవ్ జీహాద్.. ముస్లిం కానీ యువతులను, మహిళలను ట్రాప్ చేసి.. ఆ తర్వాత వారిని బలవంతంగా మతం మార్చి.. వివాహం చేసుకుంటూ.. వారి జనాభాను పెంచుకునే ఓ కుట్ర. ఈ లవ్ జీహాద్కు కేవలం హిందూ యువతులే కాదు.. క్రిస్టియన్ యువతులు కూడా బలైపోతున్నారు. గత దశాబ్ధకాలంగా దేశంలో అనేక మంది యువతులు లవ్ జీహాద్ బారినపడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అమాయకంగా ప్రేమ పేరుతో హిందూ, క్రిస్టియన్ యువతులను పరిచయం చేసుకుని.. వారి పేర్లను కూడా హిందూ పేర్లు చెప్పుకుంటూ.. (అవసరమైన చోట) వారిని మెల్లిగా ప్రేమలోకి దింపి.. ఆ తర్వాత వివాహం చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత వారి నిజస్వరూపం ప్రదర్శిస్తూ.. వివాహమైన యువతులను కూడా బలవంతంగా మతం మార్చడం లేదా.. హతమార్చడం జరుగుతోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కొన్ని యూపీలో చోటుచేసుకున్నాయి. ఇక కేరళ రాష్ట్రంలో అనేక మంది యువతులు లవ్ జీహాద్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఏకంగా పలు చర్చిలు బహిరంగాగానే లవ్ జీహాద్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
తాజాగా యూపీలోని లఖీంపూర్ ఖేదీలో ఓ మైనర్ హిందూ బాలికపై అత్యాచారం చేసి.. ఆపై ఆ బాలికను దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. హిందూ పేరుతో పరిచయం పెంచుకుని సదరు మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా.. గ్రామ శివారులోకి తీసుకెళ్లి.. అత్యాచారం చేసి ఆపై క్రూరంగా చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేసి.. విచారించగా హత్యచేసింది తానేనంటూ ఒప్పుకున్నాడు. అయితే కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సదరు మృతురాలిని హిందూ పేరుతో పరిచయం చేసుకున్నట్లు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యోగీ సర్కార్ సీరియస్ అయ్యింది. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, లవ్ జీహాద్కు చెక్ పెట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలంటూ యూసీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల లవ్ జీహాద్కు సంబంధించిన పలు ఘటనలు బయటపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కాన్పూర్, మీరట్ ప్రాంతాలలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికోసం అవసరమైతే ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చే ఆలోచనలో యోగీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.