సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల చావుకు కారణమైన సీఎం కేసీఆర్.. హంతకుడితో సమానం అన్న విధంగా ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని.. ఇంకా ఎంతమంది బలవుతే.. నోటిఫికేషన్లు ఇస్తావు దొర..? అంటూ ప్రశ్నించారు. ఇంకో నిరుద్యోగి ప్రాణం పోకముందే ఇవ్వండని.. లేదా సీఎం పోస్ట్కి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్.. ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడండి. ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదు. ఎందుకంటే
1/2— YS Sharmila (@realyssharmila) November 17, 2021
చచ్చేది మీ బిడ్డలు కాదు కాబట్టి. మీకు సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాలు మీద లేదు. నిన్న మహేష్, ఈ రోజు లవన్ కుమార్, శ్రీకృష్ణ.. ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు మీరు.మరొక్క నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు వేయండి. లేదంటే రాజీనామా చేయండి.
2/2— YS Sharmila (@realyssharmila) November 17, 2021