ఇంత దారుణమా..? వ్యాక్సిన్స్‌ కూడా దొంగతనమా..?

Spread the love

కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాజస్థాన్‌లో దారుణాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌ రాష్ట్రంలో క్రైం రేటు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా దొంగతనాలు జరుగుతుండటం అన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. కొన్ని చోట్ల దొంగలు బ్యాంకులను దోచుకుంటారు. ఇంకా మరికొన్ని చోట్ల ఇళ్లల్లో, షాపుల్లో చోరీలు చేస్తుంటారు. ఇక అంతా అనారోగ్యం పాలైతే వెళ్లే ఆస్పత్రుల్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతుంటాయి. అయితే రాజస్థాన్‌లో మాత్రం ఓ ఆస్పత్రిలో జరిగిన దొంగతనం గురించి తెలిస్తే షాక్‌ అవుతారు.

జైపూర్‌లోని హరిబక్స్‌ కన్వటియా ప్రభుత్వ ఆస్పత్రిలో కొందరు దుండగులు కరోన టీకాలను దొంగిలించారు. ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్లను కోల్డ్‌ స్టోరేజ్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఆస్పత్రి నుంచి 320 కరోనా డోసులు మిస్స్‌ అయ్యాయని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. 320 కోవాక్సిన్‌ టీకాలు మిస్స్‌ అయ్యాయని ఫిర్యాదు అందిందని.. ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని పోలీసు స్టేషన్‌ ఇంఛార్జ్‌ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేపడుతున్నామని.. ఈ ఘటనలో ఆస్పత్రి వర్గాల సిబ్బంది హస్తం ఉందేమోనని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. త్వరలోనే నిందితుల్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.


Spread the love
error: Content is protected !!