కరోనా ఎఫెక్ట్ : దేశంలో రెండో మరణం నమోదు..!

Spread the love

కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో ఈ మహమ్మారి మన దేశం లోకి కూడా ఎంటర్ అయ్యింది. ఇప్పటికే దేశంలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో గురువారం కర్ణాటకలో 76 ఏళ్ల ఓ వృద్ధుడు చనిపొవడంతో దేశంలో తొలి కరోనా మరణం సంభవించింది. తాజాగా ఢిల్లీలో శుక్రవారం రాత్రి మరొకరు ఈ మహమ్మారి వైరస్ కారణంగా మృతిచెందారు.

69 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయినట్లు.. ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సదరు వృద్ధురాలు కరోనా ఎఫెక్ట్ తోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మృతురాలికి గతం నుంచే బీపీ, షుగర్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకూ ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి.

 

మరోవైపు తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తిని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం హర్షణీయమని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు.

నగరంలోని మహేంద్రహిల్స్‌కు చెందిన వ్యక్తికి తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్‌ రావడంతో పాటు పూర్తిగా కోలుకోవడంతో సదరు వ్యక్తిని ఇంటికి పంపించారు. ఈ నెల 1వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. అతనికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించారు.


Spread the love
error: Content is protected !!