పాక్‌లో మరో దారుణం.. మేకను కిడ్నాప్‌ చేసి ఆపై అత్యాచారం.. ఐదుగురిపై కేసు నమోదు..

Spread the love

పాకిస్తాన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మనుషులపై అత్యాచారం చేసిన పాక్‌లోని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు.. ఇప్పుడు నోరు లేని మూగ జీవులను కూడా వదలడంలేదు. నోరు లేని ఓ మేకపై ఐదుగురు కామాంధులు కిడ్నాప్‌ చేసి ఆపై అత్యాచారం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ట్రిబ్యూన్‌ ఎక్స్‌ప్రెస్‌, డాన్‌ పత్రికలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. పలు అంతర్జాతీయ పత్రికల కథనాల ప్రకారం పాక్‌ లోని ఓకారాలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక సత్‌గరా పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. పోలీసులు నమోదు చేసిన కేసు ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కూలి అయిన అజహర్‌ హుస్సేన్‌కు చెందిన ఓ మేకను..నయీమ్‌, నదీమ్‌,రబ్‌,నవాజ్‌తో పాటుగా మరో వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అజహర్‌ ఇంటి నుంచి మేకను ఐదుగురు వ్యక్తులు అపహరించి ఓ కౌంపౌండ్‌లోకి లాక్కెల్లి.. రేప్‌ చేశారని.. ఆపై దానిని హతమార్చారంటూ మేక యజమాని బాధితుడు అజహర్‌ ఆరోపించాడు.

మేకను కౌంపౌండ్‌లోకి లాక్కెళ్లి.. ఆపై దానిని రేప్‌ చేశారని.. ఒకరి తరువాత ఒకరు.. మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు.. మేకను అతిక్రూరంగా హింసించి హతమార్చారంటూ ఆరోపించాడు. మేక యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతిచెందిన మేకను పోలీసులు స్వాధీనం చేసుకుని సమీప ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదికలో కూడా మేక మృతి చెందడానికి ముందు అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు మేకను రేప్‌ చేసి హతమార్చిన వారికోసం గాలింపు ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని స్థానిక పోలీస్ స్టేషన్‌ ఉన్నతాధికారి జావేద్‌ ఖాన్‌ తెలిపారు.

కాగా, మేకపై జరిగిన ఈ దారుణ ఘటనపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Spread the love
error: Content is protected !!