ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా చెక్ పెడుతున్నామని పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ అన్నారు. అంతేకాదు.. తాము కరోనా మహమ్మారికి మందు కనుగొనేందుకు ప్రత్యేక శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేశామని.. వారు నిరంతరం కష్టపడుతూ.. ఈ మందును కనిపెట్టారని తెలిపారు. తొలుత వైరస్తో పోరాడగల సమ్మేళనాలను గుర్తించామని.. ఆ తర్వాత.. కరోనా సోకిన కొందరిపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో 100శాతం ఫలితాలు వచ్చాయని.. తాము అందించిన మెడిసిన్ ద్వారా.. 5-14 రోజుల వ్యవధిలోనే కరోనా సోకిన రోగులు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్ నిర్వహించిన తర్వాత.. తాము కరోనా వైరస్ను ఆయుర్వేదం ద్వారా నియంత్రించ వచ్చని ఖచ్చితంగా చెప్పగలమని పతంజలి సీఈఓ తెలిపారు. అంతేకాదు.. మరో నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో, వివరాలను ప్రకటించబోతున్నామని ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కానీ మందు కానీ ఎంత తొందరగా వస్తే అంత మంది ప్రాణాలు నిలుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 76 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మనదేశంలో ఇప్పటికే మూడు లక్షల మార్క్ను దాటేసింది. అందులో 130కోట్లకు పైగా ప్రజలు ఉన్న మన దేశంలో వైరస్ వ్యాప్తి పెరిగితే కష్టమన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కానీ మందు కానీ ఎంత త్వరగా వస్తే అంత బెటర్.
#WATCH We appointed a team of scientists after #COVID19 outbreak. Firstly, simulation was done&compounds were identified which can fight the virus. Then, we conducted clinical case study on many positive patients&we've got 100% favourable results: Acharya Balkrishna,CEO Patanjali pic.twitter.com/3kiZB6Nk2o
— ANI (@ANI) June 13, 2020