ఎగిరే కార్లు.. అందరికి ఆశ.. ఎప్పుడు మన ఇండియాలో వస్తాయని.. ఎప్పుడు అందులో ఎగురుదామని .. అలా అనుకునే వారి ఆశలు త్వరలోనే తీరనున్నాయి. అది కూడా మనదేశంలోనే తయారయ్యి కార్లలోనే ఎగరొచ్చు. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ఎగిరే కార్లు ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఇంకా రాలేదు. అయితే నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీతో గుజరాత్ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఎగిరేకార్లను ఇక మన దేశంలోనే తయారు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ నెదర్లాండ్స్ కి చెందిన కంపెనీ.. పీఏఎల్-వీ భారత్లో ఎగిరే కార్ల తయారీ యూనిట్ను నిర్మించనుంది. దీనికి చెందిన కార్ల తయారీ ప్లాంట్ను గుజరాత్లో నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. వచ్చేఏడాది నుండి అక్కడ ఉత్పత్తి ప్రారంభించాలని ప్లాన్లు వేసుకుంది. ఇందుకు అవసరమైన అన్ని పర్మిషన్లు , సౌకర్యాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని గుజరాత్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ప్రకటించారు.
ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే… ఇక భారత్ నుండే ఇతర దేశాలకు ఈ ఎగిరే కార్లను ఎగుమతి చేయడమే. ఇక ఈ కారులో ఉన్న ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో రెండు ఇంజన్లు ఉంటాయి. ఇది గంటకు 160 నుంచి 180 కి.మీల స్పీడ్ తో ప్రయాణిస్తుంది. కారు స్టార్ట్ చేసిన మూడు నిమిషాల్లోనే ఎగరటానికి రెడీ అవుతుంది. ఫుల్ ట్యాంక్ ఇంధనంతో.. నాన్ స్టాప్ గా 500 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది.