వాటన్నింటిని తనిఖీ చేయాల్సిందే.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..!

Spread the love

రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని మదర్సాలు, మసీదులు, దేవాలయాలు,గురుకులాలతో పాటు.. వేదిక్ పాఠశాలు,శిశుమందిరాల్లో తనిఖీ చేయాలన్నారు. అంతేకాదు ఆచార్యకులను కూడా తనిఖీ చెయ్యాలని డిమాండ్ చేశారు.

దేశంలోని ఏ గురుకులాల్లో కానీ.. శిశుమందిరాల్లో కానీ, దేవాలయాల్లో కానీ ఆయుధాలు, డ్రగ్స్‌ లభించవని నేను హామీ ఇస్తున్నానన్నారు. అయితే మసీదులు, మదరసాల్లో కూడా ఎలాంటి అక్రమాలు జరగడం లేదని వాటికి సంబంధించిన వారు హామీ ఇవ్వాలన్నారు. రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


Spread the love
error: Content is protected !!