లైబ్రరీకి దుండగుల నిప్పు.. 3000 భగవద్గీత పుస్తకాలు దగ్ధం.. అంతేకాదు.. ఇంకా!

Spread the love

కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. మైసూర్‌లోని ఓ లైబ్రరీకి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో అందులో ఉన్న 3000 భగవద్గీత కాపీలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు.. దాదాపు వెయ్యి కాపీల ఖురాన్‌, బైబిల్‌లు కూడా అగ్నిలో ఆహుతయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జాతీయ ఇంగ్లీష్‌ ప్రతిక (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌) కథనం ప్రచురించినట్లు ఓ జాతీయ వెబ్‌సైట్‌ దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ పబ్లిక్‌ లైబ్రరీని సయ్యద్ ఇసాక్‌ అనే వ్యక్తికి చెందింది. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ మంటలు చెలరేగాయని ఐజాక్‌ తెలిపారు. లైబ్రరీలో మంటలు చెలరేగుతున్నాయని ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందిందని.. వెంటనే లైబ్రరీ వద్దకు పరుగులు పెట్టానని.. అయితే అప్పటికే భారీగా మంటలు చెలరేగి అందులో ఉన్న విలువైన పుస్తకాలన్నీ బూడిదయ్యాయని విచారం వ్యక్తం చేశాడు.

కాగా, సయ్యద్ ఇసాక్‌ ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. ఆయన ఓ దినసరి కూలీ అని.. అయితే అతడికి పుస్తకాలంటే అమితమైన ప్రేమ అని స్థానికులు చెబుతున్నారు. లైబ్రరీలో మొత్తం 11 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయని.. వీటిని దాతల ద్వారా సేకరించానని.. ఈ పుస్తకాలను చదువుకోడానికి అందరికీ ఇస్తుంటానని సయ్యద్‌ ఇసాక్‌ తెలిపారు.

తన లైబ్రరీలో మూడు వేలకు పైగా భగవద్గీత పుస్తకాలు ఉన్నాయని.. వెయ్యికి పైగా ఖురాన్‌, బైబిల్‌ గ్రంథాలు ఉన్నాయని ఇసాక్‌ తెలిపాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని..వారు ఐపీసీ సెక్షన్‌ 436కింద కేసు నమోదు చేశారని తెలిపాడు. తాను సరైన విద్యను నేర్చుకోలేదని.. నాలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకుడదని.. అందుకే పది మందికి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఈ లైబ్రరీని ప్రారంభించానని తెలిపాడు. అయితే ఈ లైబ్రరీని మళ్లీ తిరిగి నిర్మాణం చేపడుతానంటూ ధీమా వ్యక్తం చేశారు.


Spread the love
error: Content is protected !!