యావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. మన పొరుగు దేశం పాక్ మాత్రం.. మన దేశంలో ఎలా అలజడి సృష్టించాలి..? అని కుట్రలు పన్నుతోంది. అంతేకాదు.. అదనుచూసి ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపేలా ప్రయత్నాలు చేస్తోంది. గత నెలన్నర రోజులకు పైగా ఓ వైపు లాక్డౌన్ కొనసాగుతుంటే.. పాక్ మాత్రం నిత్యం ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించే ప్రయత్నాలకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. పాక్ కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. తాజాగా.. జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ కపోతాన్ని (పావురాన్ని)
పంపించింది. దానికి ట్రైనింగ్ ఇచ్చి.. దాని కాలికి ఓ ఉంగరాన్ని తగిలించి సరిహద్దుల్లోకి పంపించింది. కథువా జిల్లా హీరా నగర్ సెక్టార్లోని మన్యారీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రింగ్ కలిగిన పావురాన్ని చూసిన స్థానిక గ్రామస్థులు.. విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు పావురాన్ని అందజేశారు. ఈ విషయాన్ని కథువా సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి (ఎస్ఎస్పీ) శైలేంద్ర మిశ్రా తెలిపారు. పావురం గురించి స్పందించిన ఆయన.. దాని కాలికి ఓ రింగ్ ఉండటంతో పాటుగా.. కొన్ని కోడింగ్ నంబర్లు కూడా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఆ కోడ్ గురించి విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
A pigeon, suspected to be trained in Pakistan for spying, captured along the International Border (IB) in Kathua district of Jammu and Kashmir: officials.
— Press Trust of India (@PTI_News) May 25, 2020