పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు చావుదెబ్బ తగిలింది. పాక్ నుంచి మన దేశంలోని చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల్ని సరిహద్దులోనే భారత సైన్యం మట్టుబెట్టింది. రిపబ్లిక్, న్యూస్18 జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. పూంచ్ జిల్లాలోని మోన్డార్ సెక్టార్ వద్ద టెర్రర్ ప్యాడ్లాంచ్ను ధ్వంసం చేసింది భారత సైన్యం. ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపేందుకు పాక్ సైన్యం కూడా ప్రయత్నాలు చేసిందని.. వారిని సరిహద్దు దాటించేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కాల్పులకు దిగిందని.. ఈ సమయంలోనే ఉగ్రవాదులు దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించినట్లు సైన్యం గుర్తించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సైన్యం.. చొరబాటుదారులను అడ్డుకునేందుకు టెర్రర్ లాంచ్ప్యాడ్ను ధ్వంసం చేసింది. ఆ సమయంలో అక్కడ 10 నుంచి 15 మందికి పైగా ఉగ్రవాదులు ఉన్నారని.. వారిలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని.. విశ్వసనీయ సమాచారం. అయితే ఉగ్రవాదులు డెడ్ బాడీస్ను పాక్ సైన్యం తీసుకెళ్లడాన్ని గుర్తించినట్లు సమాచారం.
ఇదిలావుంటే.. నౌషెరా సెక్టారు మీదుగా సరిహద్దు దాటి చొరబడేందుకు యత్నించిన మరో ముగ్గురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు కూడా తెలిపారు.
In an ongoing counter-infiltration operation since 28 May, alert troops of Indian Army eliminated an infiltration bid along Line of Control in Naushera Sector. 3 heavily-armed Pakistan trained terrorists have been killed. Search operation in the area is in progress: Indian Army pic.twitter.com/FITyzEc559
— ANI (@ANI) June 1, 2020