యాదాద్రి రైల్వే స్టేషన్ పేరును రైల్వేశాఖ మార్పు చేసింది. ఇకపై ఈ స్టేషన్ పేరును యాదాద్రిగా ఖరారు చేస్తున్నట్లు.. సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. సోమవారం నుంచి రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్చుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారుజ. స్టేషన్ కోడ్ను కూడా YADDగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, త్వరలో యాదాద్రిలో ఆలయ పునర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. దీనికి సబంధించిన పనులను ఇటీవల సీఎం కేసీఆర్ సందర్శించిన సంగతి తెలిసిందే.