కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గతకొద్దిరోజులుగా ఆయన కిడ్నీ సంబంధింత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను గత బుధవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతుండగా ఆదివారం సాయంత్రం.. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
హన్స్రాజ్కు భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సోమవారం సాయంత్రం నిగంబోద్ ఘాట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన హన్స్రాజ్ భరద్వాజ్.. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేశారు.