దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడానికి కారణం తబ్లీగీ జామత్ సమావేశమేనంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో శివసేన సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లీగీ జమాత్ సమావేశంలో పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొన్నారని.. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని తెలిపింది. సమావేశం అనంతరం అక్కడే మూసిఉన్న ఓ ప్రదేశంలో పెద్ద ఎత్తున సభ్యులు ఉండటంతో పాటు.. కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనలు ఉల్లంఘించారని.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండేసరికి కరోనా వ్యాప్తి జరిగిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 233 మంది తబ్లీగీ జామత్ సభ్యులను అరెస్ట్ చేశామన్నారు. 2,361 మందిని తబ్లీఘీ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి వారి ప్రాంతాలకు తరలించామన్నారు. ఇక జమాతే చీఫ్ మౌలానా మహ్మద్ సాద్పై దర్యాప్తు జరుగుతోందని వివరించారు.
అంతేకాదు.. 36 దేశాలకు చెందిన 956 మందిపై ఢిల్లీ పోలీసులు 59 ఛార్జీ షీట్లను నమోదు చేసినట్లు వివరించారు. అంతేకాదు.. వారికి సంబంధించిన వీసాలను రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టినట్లు వెల్లడించారు.