లక్షయువగలార్చన కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాల్సిందే.. విశ్వ హిందూ పరిషత్

Spread the love

విశ్వ హిందూ పరిషత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న భగవత్ గీత లక్ష యువగలార్చన కార్యక్రమం విజయవంతం చేయాలన్న లక్ష్యంతో భాగ్యనగర్ ప్రాంతంలోని మహిళా శక్తి విభాగం ప్రముఖులు కోఠి లోని విజయ శ్రీ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇటీవలే శ్రావణ మాసంలో పలు చోట్ల సామూహిక వరలక్ష్మి వ్రతాలలో పాటుగా.. పరిషత్ స్థాపన దివాస్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక రాబోయే గీత జయంతి సందర్భంగా భాగ్యనగర్ లో చేపట్టబోయే లక్షయువగలార్చన కార్యక్రమాన్ని విజయంతం అయ్యేలా దృష్టి పెట్టాలని.. అందుకు అనుగుణంగా 15 నుండి 40 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి హిందువును కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ప్రాంత ఉపాధ్యక్షురాలు డాక్టర్ భేరి సునీత రామ్ మోహన్ రెడ్డి అన్నారు.

 

అనంతరం భగవద్గీత లక్షయువగళార్చన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

మరో కాలంశంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రి యాది రెడ్డి గారు కూడా మహిళా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.మాతృశక్తి స్థాపన, విస్తరించిన విధానం, సమాజంలో కుటుంబ వ్యవస్థలో మాతృముర్తుల ప్రాముఖ్యత గురించి తెలియచేశారు.

 

ఈ కార్యక్రమంలో ప్రాంత సహ కార్యదర్శి జగదీశ్వర్ జీ, మాతృ శక్తి సంయోజిక పావని, సహా సంయోజిక పద్మ శ్రీ మరియు భాగ్యనగర్ ప్రాంతంలోని మహిళా ప్రముఖులు,దుర్గా వాహిని ప్రముఖులు పాల్గొన్నారు.


Spread the love
error: Content is protected !!