సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశం ఉందన్న సమాచారంతో కేసీఆర్ ఈ సారి అయినా ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ ట్వీట్ చేశారు. సెకండ్ వేవ్లో వైద్యులుంటే బెడ్స్ లేక.. బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పారసిటమోల్ వేసుకుంటే సరిపోతుందంటూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. దొరగారు.. కనీసం ఈ సారి అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా ప్రజలను కాపాడాలంటూ వైఎస్ షర్మిల కోరారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్ పోస్ట్ ద్వారా కోరారు.
కరోనా 2nd వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతుంటే
పారాసిటమోల్ వేసుకంటే సరిపోతుందని
ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.1/1— YS Sharmila (@realyssharmila) November 29, 2021
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడండి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చెయ్యండి. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయినా కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించండి. 2/2
— YS Sharmila (@realyssharmila) November 29, 2021