దొరగారు అంటూ.. సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల పంచ్‌లు

Spread the love

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశం ఉందన్న సమాచారంతో కేసీఆర్ ఈ సారి అయినా ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ ట్వీట్‌ చేశారు. సెకండ్‌ వేవ్‌లో వైద్యులుంటే బెడ్స్‌ లేక.. బెడ్స్‌ ఉంటే ఆక్సిజన్‌ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పారసిటమోల్‌ వేసుకుంటే సరిపోతుందంటూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. దొరగారు.. కనీసం ఈ సారి అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా ప్రజలను కాపాడాలంటూ వైఎస్‌ షర్మిల కోరారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్‌ పోస్ట్ ద్వారా కోరారు.


Spread the love
error: Content is protected !!