హైవేపై ట్రాఫిక్‌ జామ్‌.. మిరాజ్‌-2000 ఫైటర్‌ జెట్‌ టైర్‌ చోరీ.. ఎవరీ దొంగలు..?

Spread the love

లక్నోలో జరిగిన ఓ చోరీ కలకలం రేపుతోంది. ఓ భారీ ట్రక్కులో మిరాజ్‌-2000 ఫైటర్‌ జెట్‌ విమానాన్ని బక్షి-కా-తలాబ్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ విమానం టైర్‌ను దుండగులు దొంగిలించారు. ఈ ఘటన నవంబర్‌ 27వ తేదీన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ట్రక్కు డ్రైవర్‌ బక్షి-కా-తలాబ్‌ ఎయిర్‌బేస్‌ నుంచి జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌కు మిరాజ్‌2000 ఫైటర్‌ జెట్‌ను తరలిస్తుండగా.. షహీద్‌ మార్గంలో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ సమయంలోనే స్కార్పియోలో వచ్చిన దుండగులు టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే.. ట్రక్కు డ్రైవర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆషియానా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్‌ అమిత్‌
తెలిపారు.


Spread the love
error: Content is protected !!